క్రైమ్/లీగల్

ఇద్దరు విద్యార్థులు అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొల్లప్రోలు, ఆగస్టు 13: గొల్లప్రోలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆదివారం నుండి కనిపించడంలేదు. స్థానిక ఈబీసీ కాలనీకి చెందిన శానపల్లి సత్యనారాయణ, పాపయ్య చావిడి వీధికి చెందిన సూర్నీడి తరుణ్‌లులు స్థానిక మాధురి విద్యాలయలో 10వ తరగతి చదువుతున్నారు. వీరిరువురు ఆదివారం సాయంత్రం ట్యూషన్‌కు వెళుతన్నామని ఇంటి వద్ద చెప్పి సైకిళ్లపై బయలుదేరారు. రాత్రి ఎంత సమయమైనా ఇంటికి రాకపోవడంతో వీరి తల్లిదండ్రులు బంధువుల ఇంటి వద్ద విచారించి పరిసర గ్రామాల్లో వెదికారు. చేబ్రోలు శివారు సత్తెమ్మ తల్లి ఆలయం సమీపంలో సైకిళ్లను కనిపెట్టారు. కానీ విద్యార్థుల ఆచూకీ తెలియలేదు. వీరి స్నేహితుల వద్ద విచారించగా ఉద్దేశపూర్వకంగానే ఇంటి వద్ద నుండి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. విద్యార్థుల అదృశ్యంపై వీరిరువురి తండ్రులు శానపల్లి తాతారావు, సూర్నీడి వరహాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.