క్రైమ్/లీగల్

నీట మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 13: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండల పరిధిలోని ఓబులోనిపల్లి గ్రామ సమీపంలో నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు(పిల్లలకు పేర్లు పెట్టలేదు) మృత్యువాత పడిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఓబులోనిపల్లి గ్రామానికి చెందిన పెద్ద నర్సింహులు, చిన్న నర్సింహులు అన్నదమ్ములు. వీరికి గ్రామ సమీపంలో వ్యవసాయ పొలం ఉంది. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా సంగాల రిజర్వాయర్‌కు వచ్చే కాలువ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలం వద్ద గుడిసె వేసుకొని వ్యవసాయ పనులను చేపడుతుంటారు. సోమవారం సీడ్ విత్తనోత్పత్తి పంట పనుల్లో నిమగ్నమైన పెద్దనర్సింహులు, చిన్న నర్సింహులు కుటుంబం వారి సంతానం ఇరువురి చిన్నారులను గుడిసె వద్ద వదిలి పనిల్లో నిమగ్నమయ్యారు. ఆడుకుంటున్న ఆ చిన్నారులు సమీపంలో కాలువ వద్దకు వెళ్లి నీటిలో మునిగిపోయారు. అరగంట తర్వాత చిన్నారుల జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు కాలువ వెంట వెతుకగా, అరకిలోమీటర్ దూరంలో ఓ కల్వర్టు వద్ద ఇద్దరు చిన్నారుల మృతదేహాలు కన్పించాయి. వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్న కాలువ సమీపంలో గుడిసెలో ఉన్న చిన్నారులను చూసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని బోరున విలపించారు.