క్రైమ్/లీగల్

వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, ఆగస్టు 13: మర్కూక్ మండలం భావానందాపూర్ గ్రామ శివారులోని కూరగాయల తోటలో శ్రీనివాస్(27) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ శివలింగం తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బావానందాపూర్ గ్రామ శివారు బండకుంట శివారులోని కూరగాయల తోటలో ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌లు వేర్వేరు తోటల్లో పనిచేస్తూ ఇద్దరు ఒకే రూంలో కలిసి ఉంటున్నారు. అయితే ఆదివారం రాత్రి ఇద్దరు కలిసి రూంలో మద్యం తాగుతూ ఏవేవో విషయాలు మాట్లాడుతున్నారు. ఈ మాటల్లో వ్యక్తిగత విమర్శలకు తావివ్వడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఉద్వేగాలకు లోనయ్యారు. దీంతో ప్రభాకర్‌రెడ్డిని శ్రీనివాస్ ద్వేషించడంతో ప్రభాకర్‌రెడ్డి మద్యం మత్తులో ఉండడం వల్ల పక్కనే ఉన్న గొడ్డలితో శ్రీనివాస్ మెడపై నరికాడు. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా శ్రీనివాస్‌ది ఆంధ్రాప్రాంతం కాగా, ప్రభాకర్‌రెడ్డిది అనంతాపూర్ (రాయలసీమ)కు చెందినవాడని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.