క్రైమ్/లీగల్

ముగ్గురి హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, ఆగస్టు 14: మండలంలోని అందుగుల కొత్తపాలెంలో ఈనెల తొమ్మిదో తేదీన సీసీ రోడ్డు వేసే విషయంలో జరిగిన గొడవల వల్ల, గతంలో పాతకక్షలు, గ్రామంలోని వర్గపోరు వల్ల కుట్రపన్ని పథకం ప్రకారం ముగ్గురిని హత్య చేసిన కేసులో ఐదుగురు హంతకులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు పట్టణ సిఐ శ్రీనివాసరావు విలేఖరులకు వెల్లడించారు. ఒక వర్గానికి చెందిన గురజాల సోమయ్య, చల్లా వెంకటకృష్ణ, మూగబోయిన మల్లిఖార్జునరావులను మోటార్ సైకిల్‌పై వినుకొండకు వస్తుండగా చల్లా చినసాంబయ్యకు చెందిన కారులో తన వర్గీయులైన ఎనుగంటి రామకోటయ్య, పొలూరి ఏడుకొండలు, ఎనుగంటి శ్రీనివాసరావు, మందటి రామారావులతో కలిసి కారుతో పసుపులేరు బ్రిడ్డిపై ఎదురుగా లారీ రావడం, పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి వారి మృతికి కారణమైనట్లు సిఐ వెల్లడించారు. ముద్దాయిలైన ఐదుగురిని సోమవారం అరెస్ట్‌చేసి, మంగళవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సిఐ తెలిపారు.