క్రైమ్/లీగల్

వాహనం బోల్తా పడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఆగస్టు 14: బీర్పూర్ మండల కేంద్రంలోని జడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ప్రమాద వశాత్తూ వాహనం బోల్తా పడిన సంఘటనలో మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం, గాదెపెల్లి తదితర గ్రామాల విద్యార్థులు టిఎస్ 02 యుబి 5663 నెంబరుగల వాహనంలో ప్రతిదినం బీర్పూర్ పాఠశాలకు వెళ్ళివస్తుంటారు. మంగళవారం పాఠశాల పని వేళలు ముగియగానే తిరిగి వస్తుండగా సాయంత్రం 5గంటలకు గాదెపెల్లి గ్రామ శివారులో వాహనం స్టీరింగ్ అదుపు తప్పి రోడుపై బోల్తా పడడం, అందులోని విద్యార్థులు చెల్లాచెదురుగా పడిపోవడం భార్గవ్ అనే విద్యార్థి తలపైనుండి వాహనం వెళ్ళడంతో భార్గవ్ అక్కడికక్కడే మృతి చెందాడు, పలువురు గాయాల పాలైనారు. సారంగాపూర్ మండలం అర్పపెల్లి స్వగ్రామమైన మాతేటి భాస్కర్ (13) తండ్రి నుండి వేరుగా తల్లితో తీగలధర్మారంలోని అమ్మమ్మ వద్ద ఉంటూ బీర్పూర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.