క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, ఫిబ్రవరి 23: మండల పరిధిలోని వంగవీడు గ్రామంలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం తెల్లవారు జూమున జరిగింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన ఓబుల వెంకట్రామిరెడ్డి(55), పుల్లమ్మ(50) వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి ఉప్పలమ్మ దేవతను ఎప్పుడు పెట్టుకొవాలనే విషయంపై భార్యాభర్తల మధ్య వాగ్వివాదం జరిగినట్లు వారి కుమారుడు తెలిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు వరండాలో నిద్రించారని తెలిపాడు. శుక్రవారం తెల్లవారు జామున 5గంటల సమయంలో తల్లిదండ్రులను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా ఎంతకు లేవకపోవడంతో గ్రామంలోని ఆర్‌ఎంపి వైద్యుని పిలవగా వచ్చి చూసి గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. గ్రామంలో ఎవరి విషయాలలోను తలదూర్చకుండా తమ పని తాముచేసుకుంటూ అందరితో మంచిగా వుండే వెంకట్రామిరెడ్డి దంపతులు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుమారుడి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ బండారి కిశోర్ కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.