క్రైమ్/లీగల్

పల్లెలో టీడీపీ కార్యకర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఆగస్టు 16:పట్టణంలో గురువారం టీడీపీ కార్యకర్త, రాష్ట్ర కార్మిక కనీస వేతన సవరణ బోర్డు డైరెక్టర్ పాలూరు లక్ష్మీనరసింహకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు.. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్ జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంటి పక్కనే వున్న గదిలో ఉరి వేసుకున్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బనగానపల్లె ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. కుమార్ గత 25ఏళ్ల నుంచి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. కుమార్ మృతికి పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి, బీసీ బాలతిమ్మారెడ్డి, వైసీపీ నేతలు కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, కాటసాని ప్రసాదరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డి, బండి బ్రహ్మానందరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ కోడి నాగరాజు యాదవ్, మాజీ ఎంపీపీ కె.అశ్వర్థమాచారి, న్యాయవాదులు మాధవరెడ్డి, జగన్నాథరెడ్డి, మైనార్టీ నేత బురానుద్దీన్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమాన సంఘాల వారు నివాళులు అర్పించారు.