క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంగునూరు, ఆగస్టు 16: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన నంగునూరు మండలం గట్లమల్యాలలో గురువారం జరిగింది. రాజగోపాల్‌పేట ఎస్‌ఐ చంద్రశేఖర్, గ్రామస్థు కథనం ప్రకారం గట్లమల్యాల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పుల్లూరి సాయితేజ, అనిల్, అరుణ్ లు చదువుకుంటున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం బడి ఆవరణలో ఉన్న మోటర్ సైకిల్‌పై సాయితేజ నడుపుండగా ఇద్దరు స్నేహితులు వెనుకాల కూర్చున్నారు. ఉన్నత పాఠశాల నుండి అక్కెనపల్లిపల్లి మోడల్ స్కూల్ వరకు వెళ్లి అతివేగంగా వస్తున్న క్రమంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్లుకు ఢీకొట్టారు. దీంతో సాయితేజ(14) అక్కడిక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైన అనిల్, అరుణ్‌లను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరిలో అనిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరిలించారు. స్కూల్‌కు వెళ్లిన తన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలువగానే సాయితేజ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. బడిలో ఉండాల్సిన తన కొడుకు ఎలా మృతి చెందాడని రోదించారు. సాయితేజ తండ్రి రవీందర్ పిర్యాదు మేరకు ఎస్‌ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేటకు తరలించారు.