క్రైమ్/లీగల్

జాతీయ రహాదారిపై సీఐ వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివనగర్, ఫిబ్రవరి 23: సదాశివనగర్ జాతీయ రహాదారి పై సీఐ కృష్ణ మద్యం మత్తులో గురువారం రాత్రి వీరంగం సృష్టించినట్లు తెలిసింది. కొందరు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ధర్‌పల్లి మండలం సీఐ డి.కృష్ణ మద్యం చేవించి 44వ జాతీయ రహాదారి పై వీరంగం చేసినట్లు తెలిసింది. కామారెడ్డి నుండి ధర్‌పల్లికి వైపు కారులో వెలుతుండగా జాతీయ రహాదారి పై కారును రోడ్డుకు అడ్డంగా పలు విధాలుగా మలుపులు తిరగటంతో కొందరు ప్రయాణీకులు కారును ఆపి ప్రశ్నించడంతో తన వెంట ఉన్న రివాల్వర్‌తో వారిని బెదిరించాడన్నారు. వారు వెంటనే రోడ్డు పై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు అక్కడికి చేరుకుని వివరాలు అడగటంతో వారిని కూడా రివాల్వర్‌తో బెదిరించాడని తెలిపారు. సమాచారం అందుకున్న సదాశివనగర్ ఎస్‌ఐ నాగరాజు అక్కడికి వెళ్లి బ్రీత్‌ఎనలరైజర్‌తో పరీక్షించి, మద్యం సేవించాడని తెలడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.