క్రైమ్/లీగల్

అతి వేగం... ఐదుగురు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం: లారీ డ్రైవర్ అతివేగానికి ఐదు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఈ విషాదకర సంఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని కడపల్లి సమీపంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..తమిళనాడు రాష్ట్రం ధర్మపురి గ్రామానికి చెందిన రంగప్ప (62)కు పక్షవాతం రావడంతో బైరెడ్డిపల్లి మండలం విరుపాక్షిపురంలో నాటువైద్యం చేయించుకోవడానికి భార్య లక్ష్మి (45), దారి చూపడానికి వచ్చిన మోహన్‌కుమార్ (42), డ్రైవర్ శేఖర్ (45) గట్టూరు గ్రామానికి చెందిన మునుస్వామి (48) మారుతి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పలమనేరు-కుప్పం జాతీయ రహదారిపై కడపల్లి సమీపంలోని ఓ మలుపు వద్ద తిరుపత్తూరు నుండి తిరుపతికి వెళ్తున్న లారీ అతి వేగంతో వచ్చి కారును ఢీకొంది. ఈ సంఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న రంగప్ప, శేఖర్, లక్ష్మమ్మ, మోహన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. కొనఊపిరితో ఉన్న మునుస్వామిని స్థానికులు కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే మృతి చెందాడు. కారులో ఇరుకున్న మృతదేహాలను బయటికి తీయడానికి స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సంఘటన స్థలానికి చేరుకున్న కుప్పం సీఐ రాఘవన్, రాళ్లబూదుగూరు ఎస్సై వెంకటశివకుమార్, కుప్పం, గుడుపల్లి పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలు