క్రైమ్/లీగల్

చారకొండలో పట్టపగలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, ఫిబ్రవరి 23: చారకొండ మండల కేంద్రంలో శుక్రవారం పట్టపగలు గుర్తు తెలయని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చివరలో ఉన్న మేకల శేఖర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులను ఇతర గ్రామానికి పంపించేందుకు బస్టాండ్‌కు రాక గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి, బీరువా తాళాలు పగులగొట్టి రెండు తులాల బంగారు ఆభరణాలను దొంగిలించుకుపోయారు. ఈమేరకు బాధితుడు శేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ బద్రీనాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి తనిఖీలు చేశారు.