క్రైమ్/లీగల్

హైదరాబాద్ శివార్లలో పరువు హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ హయత్‌నగర్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివార్లలో పరువు హత్య కలకలం రేపింది. ఇష్టంలేని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్నతండ్రే కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. ఆ అమ్మాయి ఏడు నెలల గర్భవతి అన్న కనికరం కూడా లేకుండా దారుణానికి ఒడిగట్టాడు. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఎల్లంకి సురేష్ (27) వృత్తిరీత్యా మేస్ర్తి. 2014 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన మంగళపల్లి నర్సింహ్మ కూతురు విజయలక్ష్మి (27)ని ప్రేమించాడు. ఆమె తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు అతనిపై కక్ష కట్టారు. తనకు ప్రాణహాని ఉందని అనుమానించిన సురేష్ తన భార్యతో కలిసి భద్రాచలం వెళ్లి, అక్కడే జీవనం గడుపుతున్నాడు. వీరికి రఘురాం అనే నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఇటీవల తన తల్లి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని సమాచారం అందడంతో ఏడు నెలల గర్భవతైన తన భార్య విజయలక్ష్మితో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తన ఇంటికి వచ్చాడు. కాగా, చికిత్స పొందుతూ సురేష్ తల్లి మృతిచెందింది. అంత్యక్రియల తర్వాత అతను అబ్దుల్లాపూర్‌మెట్‌లోనే ఉంటున్నాడు. ఇలావుంటే, సురేష్, విజయలక్ష్మిపై కక్ష పెంచుకున్న బంధువులు గురువారం పథకం ప్రకారం దాడి చేశారు. ఇంటి వద్ద ఉన్న విజయలక్ష్మీని ఆమె తండ్రి నర్సింహ్మ, బంధువులు వనమ్మ, లావణ్య, మంగమ్మ, యాదమ్మ, మీసాల రాములయ్య కొట్టుకుంటూ, బలవంతంగా సమీపంలోని ఎస్సీ కమ్యూనిటిహాల్‌లోకి తీసుకెళ్లారు. సురేష్, అతని సోదరుడిని దగ్గరకు రాకుండ అడ్డుకొని కమ్యూనిటిహాల్ తలుపులు మూసారు. అత్యంత పాశవికంగా విజయలక్ష్మి మెడను కత్తితో కోసేశారు. ఎడమ చేతిని నరికేశారు. అనంతరం చీరతో ఉరివేసి హత్య చేశారు. హత్య జరుగుతున్న సమయంలో విజయలక్ష్మి బంధువులు కొమ్మ లక్ష్మమ్మ, గుండ మంగమ్మ,
గుండ సునంద, గుండ లింగం, గణేష్, లవకుమార్, శివకుమార్, మైసయ్య, ప్రవీణ్, శివశంకర్, యాదయ్య, మైసయ్య, శ్రీరాములు, జయమ్మ అక్కడే ఉన్నారని సురేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముందస్తు ప్రణాళికతోనే తన భార్యను హత్య చేశారని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు మొత్తం 17 మందిపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, విజయలక్ష్మికి వరుసకు బాబాయ్ అయ్యే సురేష్‌ను వివాహం చేసుకొని పరువు తీసిందని, దాంతోనే హత్య చేసిందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నట్టు సమాచారం. కానీ, ఈ ఆరోపణను సురేష్ బంధువులు ఖండించారు. అలాంటి బంధుత్వమేమీ లేదని స్పష్టం చేశారు.

చిత్రం..మృతి చెందిన విజయలక్ష్మీ