క్రైమ్/లీగల్
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 24 February 2018
పరకాల, ఫిబ్రవరి 23: ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై రైతు మృతి చెందిన సంఘటన పరకాల మండలం పరకాల మండలం ధర్మారంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన తొకల మల్లయ్య (56) తనకు ఉన్న ఎకరం భూమితో పాటు మరో రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నట్లు తెలిపారు. అశించిన దిగుబడి రాకపోవడమే కాకుండా సాగు చేసిన పంటలకు ధరలు లేక పోవడంతో రూ. 4లక్షల అప్పు అయినట్లు తెలిపారు. ఈ దరమిలా అప్పులు ఏలా చెల్లించాలనే మనోవేదనతో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం రాత్రి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు తెలిపారు.