క్రైమ్/లీగల్

పట్టపగలు కత్తులతో పొడిచి పరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఆగస్టు 30: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఇద్దరు యువకులు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశారు. దర్జాగా అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ ప్రాంతానికి చెందిన నర్సింహ్మం మైలార్‌దేవ్‌పల్లిలో గత కొంత కాలంగా టింబర్ డిపో నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు టింబర్ డిపోలోకి వచ్చి రెండు డోర్లు కావాలని, ధర ఎంత అని అడిగారు. ఆ విషయం ఆఫీస్ రూంలో మాట్లాడుతుండగా ఒక యువకుడు కత్తితో చాతిలో పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయే క్రమంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌కు పరుగెత్తి కాపాడండి అని అరుస్తూ కుప్పకూలిపోయాడు. పోలీసుల వాహనంలో నర్సింహను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.