క్రైమ్/లీగల్

పెళ్లింట విషాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, ఆగస్టు 31: చాగలమర్రిలోని సుభాషిని రెడ్డి ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగిన ఒక వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. ఫంక్షన్ హాలుకు సమీపంలోని చాగలమ్మ వంకలో ఇద్దరు పిల్లలు ప్రమాద వశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు వదిలారు. వివరాలిలా ఉన్నాయి. తమ తల్లిదండ్రులతో వివాహానికి వెళ్లిన ఉసేన్‌బాషా కుమారుడు ఇర్ఫాన్ (12), జొంగాలపల్లె షరీఫ్ కుమారుడు జుబేద్ (5)లు ప్రమాద వశాత్తు చాగలమ్మ వంకలో పడి చనిపోయారు. అయితే ఈ సంఘటనలో పోలీసు కానిస్టేబుల్ కుమారుడు ఐదేళ్ల జునైన్ మృత్యువును జయించాడు. ఈ ముగ్గురు పిల్లలతోపాటు మరి కొందరు పిల్లలు చాగలమ్మ వంక వద్ద ఆడుకుంటూ నీటిలో దిగారు. జుబేద్, ఇర్ఫాన్‌లు లోతు గుంతలోకి వెళ్లడంతో వారు మునిగిపోయారు. నీటిలో మునిగి పోతున్న జునైన్‌ను అక్కడ ఉన్న వారు కాపాడారు. నీటిలో మునిగిన ఇద్దరు పిల్లల కోసం వారి బంధువులు తీవ్రంగా గాలించి వెలికి తీశారు. వీరిని హుటాహుటిన స్థానిక కేరళ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇర్ఫాన్ స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి, జుబేద్ శ్రీ రాఘవేంద్ర ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. పెళ్లి సందడితో సంతోషాల మధ్యవున్న బంధువులకు, ఈ ఇద్దరి పిల్లల మృతి విషాదం నింపింది. కేరళ ఆసుపత్రిలో పిల్లలు ఇద్దరు శవాలపై తల్లిదండ్రులు, బంధువులు పడి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆసుపత్రి వద్దకు ప్రజలు, బంధువులు గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ ప్రియతంరెడ్డి మృతుల వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.