క్రైమ్/లీగల్

నీటితొట్టిలో పడి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వారావుపేట, సెప్టెంబర్ 15: రెండు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్ళి నీటితొట్టిలో పడి మృతిచెందిన సంఘటన పట్టణంలోని రామాలయం వీధిలో శనివారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. నారదాసు రామకృష్ణ అనే వ్యక్తి నారాయణపురం నుండి జీవనోపాధికి వచ్చి రామాలయం విధిలో కొంతకాలంగా జీవిస్తున్నాడు. స్థానిక కెమిలాయిడ్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి రెండు సంవత్సరాల వయస్సు కలిగిన గౌతమ్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి మృతి చెందాడు. బాలుడు కనిపించకపోవడంతో రామకృష్ణ భార్య కృష్ణవేణి వెతకగా నీటి తొట్టిలో కనిపించాడు. బాలుడిని బయటకు తీసి చూసే సరికి అప్పటికే మరణించాడు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ బి వెంకటేశ్వర్లు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.