క్రైమ్/లీగల్

పొడి, పేస్ట్ రూపంలో బంగారం తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ, సెప్టెంబర్ 16: తెలంగాణా కష్టమ్స్ అధికారులు కళ్లుకప్పి ఆంధ్రాకు బంగారాన్ని పొడి రూపంలో తరలిస్తున్న తమిళనాడుకు చెందిన మణికందన్ చివరకు ఆంధ్రా కష్టమ్స్ అధికారులకు చిక్కాడు. శుక్రవారం రాత్రి కష్టమ్స్ అధికారులు మధురపూడి విమానాశ్రయంలో రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం విధితమే. ఈ సంఘటనకు సంబంధించి తమిళనాడుకు చెందిన మణికందన్ దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చి అక్కడ కస్టమ్స్ అధికారులు కళ్లుకప్పి 1900 గ్రాముల బంగారాన్ని రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు తరలించగా పక్కా సమాచారం ఉన్న డిపార్ట్‌మెంటు ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు మధురపూడి విమానాశ్రయంలో అతనిని అదుపులోకి తీసుకున్నారు. పొడి రూపంలోనూ, ముద్ద రూపంలోనూ ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతనిని హైదరాబాద్‌కు తరలించి విచారిస్తున్నారు. ముద్ద బంగారాన్ని టూత్‌పేస్ట్‌లోనూ, పొడి బంగారాన్ని లోదుస్తులలో తరలిస్తున్నట్లుగా తెలిసింది.