క్రైమ్/లీగల్

తల్లీ కూతుళ్ల ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, సెప్టెంబర్ 16: మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ కాల్వలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక తల్లీకూతుళ్లు ఆత్మహత్యయత్నానికి యత్నించిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన పల్లె లింబాయి, పల్లె నర్సు అనే తల్లీకూతుళ్లు ఆర్థిక ఇబ్బందులు తాళలేక, జీవితంపై విరక్తి చెందారు. ఇద్దరు కొడుకులు ఉన్నా, వారు గల్ఫ్‌లో ఉండటం, తమను ఎవరు పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది శనివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో కాకతీయ కాల్వలో దూకి ఆత్మహత్యకు యత్నించగా, తల్లి లింబాయి కాల్వలో పడి గల్లంతు కాగా, కూతురు నర్సును స్థానికులు గమనించి కాపాడారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెండోరా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కూతురు నర్సును మెండోరా పోలీస్ స్టేషన్‌కు తరలించి, బషీరాబాద్‌లోని బంధువులకు సమాచారం అందించారు. చేదోడు వాదోడుగా ఎవరు అండగా లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురై తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు యత్నించారని, నర్సుకు మతిస్థిమితం లేదని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మెండోరా పోలీసులు తెలిపారు.