క్రైమ్/లీగల్

బడికి వెళ్లమన్నందుకు బాలిక బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, సెప్టెంబర్ 18: బడికి వెళ్ళి సక్రమంగా చదువు నేర్చుకోవాలని చెప్పినందుకు కలత చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం వీరాపూర్‌లో జరిగింది. బాలిక తల్లిదండ్రులు లక్ష్మీ, బాపుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వీరి కుమార్తె అచిత (14)ను మంచిగా చదువుకోవాలని సూచించారు. ఆ మాటకే మనస్తాపం చెందిన అచిత మంగళవారం పురుగుల మందు తాగింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అచిత మరణించింది.