క్రైమ్/లీగల్

ప్రణయ్ హంతకులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 19: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈనెల 14న పట్టపగలు దారుణంగా దళిత యువకుడు పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్‌ను హత్య చేసిన ఏడుగురు నిందితుల్లో ఆరుగురు నిందితులను మిర్యాలగూడ ఒన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం స్థానిక అదనపు జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శోభారాణి ముందు హాజరు పర్చగా వారికి 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఆరుగురు నిందితుల్లో ఎ 1 తిరునగరు మారుతిరావు, ఎ 3 ఎంఎ.అస్గర్‌అలి, ఎ4 ఎంఎ.బారి. ఎ 5 ఎండి.కరీం, ఎ 6 శ్రవణ్‌కుమార్, ఎ 7 శివకుమార్‌లను పోలీసులు హాజరు పర్చగా వారికి నల్లగొండ జిల్లా కేంద్రం జైలుకు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య నిందితులను మిర్యాలగూడకు తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు ముందు ఉదయం 10 గంటల నుండే భారీ జనం నిందితులను చూసేందుకు వేచి ఉన్నారు. వర్షం పడుతున్నప్పటికి నిందితులను ప్రజలు ఓపికగ్గా చూసి తిట్టిపోశారు. పరారిలో ఉన్న ఎ 2 నిందితుడు సురేష్‌కుమార్ శర్మను బిహార్ నుండి పోలీసులు తీసుకువస్తున్నారు.

చిత్రం..మారుతీరావు, శ్రవణ్, కరీంలను కోర్టుకు తీసుకెళ్తున్న పోలీసులు