క్రైమ్/లీగల్

దంపతుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీమకుర్తి, సెప్టెంబర్ 19: ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన చీమకుర్తి పట్టణం నడిబొడ్డున మంగళవారం అర్ధరాత్రి దొంగతనానికి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దిండుకుర్తి సుబ్బారావు (60), ఆయన భార్య ఆదిలక్ష్మి (57)లను తలకాయలు కోసి పరారు అయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
బుధవారం తెల్లవారుజామున ఎంతసేపటికి వారు ఇంటినుండి బయటకురాకపోవటంతో పక్క ఇంటివారు లోపలకు వెళ్లిచూడగా సుబ్బారావు, ఆదిలక్ష్మి రక్తమడుగులో పడి ఉన్నారు. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఒంగోలు డిఎస్‌పి, చీరాల డిఎస్‌పి, ఒంగోలు రూరల్ ఇన్‌చార్జీ సిఐ దేవప్రభాకర్ సంఘటన స్ధలానికి వచ్చి హత్యజరిగిన తీరుతెన్నులను పరిశీలించారు. సుబ్బారావు, ఆదిలక్ష్మి మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలురిమ్స్‌కు తరలిచారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు డ్వాగ్‌స్వ్కాడ్‌ను రంగంలోకి దింపారు. ఇంతకు హత్య ఏవిధంగా జరిగిందనేది వివరాలు బయటకు రాలేదు. ఈకేసును చీమకుర్తిఎస్‌ఐ గరికపాటి వెంకటేశ్వరచౌదరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సుబ్బారావు, ఆదిలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు చీమకుర్తిలోనే నివాసం ఉంటుండగా కుమార్తె వేరే గ్రామంలో అత్తారింటివద్ద ఉంది.
కాగా గుర్తుతెలియని దొంగలు సుబ్బారావు ఇంటిలో ఉన్న బంగారం, నగదుకోసం వచ్చి వారిని హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎంతబంగారం, నగదు ఎంత పోయిందన్న విషయాలను పోలీసులు విచారణలో వెల్లడి కావాల్సిఉంది. సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది.

చిత్రం..సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు