క్రైమ్/లీగల్

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, సెప్టెంబర్ 21: విశాఖ జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు మహేంద్ర వ్యాన్‌లో వస్తూ నక్కపల్లి మండలం గొడిచర్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారి సమీపంలో వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనుక నుండి ఐషర్ వ్యాన్ వచ్చి ఈ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్‌లో ఉన్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన షేక్ ఫాతిమా బీబీ (55), లోవకొత్తూరు వద్ద ఉన్న కోళ్లపారం ఏరియా వాసి వియ్యపుబాబ్జి (40), గుర్తుతెలియని మరో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్‌లో ఉన్న ఉద్దండపురానికి చెందిన కొడకుల కనకారావు(40), అదే గ్రామానికి చెందిన కొడకుల నానాజీ (35), డి. పోలవరం వాసి కింతల రాజు(28), విజయవాడకు చెందిన ఉప్పల శ్రీను(30), హైద్రాబాద్‌కు చెందిన వ్యాన్ డ్రైవర్ దాసరథిధి(40)కి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని నక్కపల్లి, కాకినాడ, విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అలాగే మండలంలోని జానకీపేట నుండి ఉపమాక మధ్యలో మైలపల్లి అయ్యన్న (35)ను ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొనడంతో మృతి చెందాడు. అదేవిధంగా నక్కపల్లి నుండి గొడిచర్ల వెళ్తున్న కొలనాటి వీరబాబు(35) జాతీయరహదారిపై మేకను తప్పిస్తుండగా వెనుక నుండి లారీ వచ్చి బలంగా ఢీకొంది. దీంతో వీరబాబు రెండుకాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. పరిస్థితి విషమయంగా ఉండటంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. నక్కపల్లి సీఐ రుద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.