క్రైమ్/లీగల్

చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల, సెప్టెంబర్ 23: గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని నందిరాజుతోట గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు సమీపంలోని చెరువులో మునిగి మృతి చెందారు. నందిరాజుతోట గ్రామాన్ని శోకసంద్రంలో ముంచిన ఈ విషాద సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. నందిరాజుతోట గ్రామానికి చెందిన ఉప్పాల ప్రసాద్ కుమారుడు సాయి(10), కేసన శ్రీనివాసులు కుమారుడు మణికంఠ(11) కలసి ఆడుకుంటూ వల్లువారిపాలెం చెరువులోకి దిగారు. కొద్దిసేపు ఆడుకున్న వీరిద్దరూ చెరువులో మునిగిపోయారు. ఆదివారం సెలవుదినం కావటంతో ఇంటి వద్ద ఆడుకుంటున్న పిల్లలు కనిపించకపోవటంతో వీరికోసం గాలించిన తల్లిదండ్రులకు మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించాయి. దీనితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే చెరువులో అక్రమంగా తవ్విన గుంట కారణంగానే వీరిద్దరూ అందులో పడి మృతి చెందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ ప్రజలంతా తండోపతండాలుగా చెరువు వద్దకు వచ్చి బాలుర మృతదేహాలను చూసి కంటతడి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.