క్రైమ్/లీగల్

రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతపై 420 కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరచింత, సెప్టెంబర్ 26: తుక్యనాయక్ తాండ నుంచి సోమవారం అర్థరాత్రి బొలేరో వాహనంలో 30 క్వింటాల్ రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తుండగా స్థానికుల సమాచారంతో పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ చేసి 420 కేసు నమోదు చేయమని ఫిర్యాదు చేయడంతో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారి వాహనం యాజమాని అయిన పట్టణానికి చెందిన తెలుగుదేశం నేత మనోహర్ రాజు తో పాటు బొలేరో వాహనం డ్రైవర్ మక్బుల్ పై కేసు నమోదు చేసినట్లు అమరచింత ఎస్సై బి రామస్వామి తెలిపారు. బుధవారం ఆయన పోలీసుస్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ రేషన్ బియ్యంను పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తు అక్రమ వ్యాపారం చేస్తున్నాడని తమ విచారణలో తేలిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నందకిషోర్, సిబ్బంది ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. నిందితులు మళ్లీ చేయకుండా ఉండేందుకే 420 కేసు నమోదు చేయమన్నారని ఎస్సై తెలిపారు.