క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, సెప్టెంబర్ 27:మండల పరిధిలోని కొండమనాయునిపల్లె గ్రామానికి చెందిన కోనేటి సుంకన్న(36) గురువారం విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందగా మెకానిక్ రాజు తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలో పడిపోయాడని స్థానికులు వెల్లడించారు. వివరాలు.. తన వ్యవసాయ పొలంలోని బోరు పని చేయకపోవడంతో సుంకన్న రుద్రవరం గ్రామానికి చెందిన మెకానిక్ రాజును తీసుకెళ్లి మరమ్మతులు చేయించాడు. అయితే ఆ సమయంలో వారిద్దరూ విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఇది గమనించిన చుట్టుపక్కల పొలాల రైతులు వెంటనే అక్కడికి చేరుకుని వారిద్దరినీ చిక్సిత కోసం బనగానపల్లెకు తరలించారు. అయితే అప్పటికే కోనేటి సుంకన్న మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. ఇక అపస్మారకస్థితిలోకి వెళ్లిన రాజును ప్రాథమిక చిక్సిత అనంతరం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం సుంకన్న మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అవుకు పోలీసుల తెలిపారు.