క్రైమ్/లీగల్

మంత్రాల నెపంతో వృద్ధుడి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, సెప్టెంబర్ 30: మంత్రాల నెపంతో వృద్ధుడు దారుణ హత్యకు గరైన సంఘటన మండలంలోని తేనేపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై క్రాంతికుమార్ గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శివార్ల లింగయ్య (65) మంత్రాలు చేస్తున్నాడని ఇదే గ్రామాన్నికి చెందిన కోట్ర అనిల్ కత్తితో వెనుకబాగం నుండి పొడిచి ఆ తరువాత గొంతు కోశాడు.అక్కడికి అక్కడే మృతి చెందాడు. రెండు సంవత్సరాలుగా అనిల్ అరోగ్యం బాగలేకపోవడంతో గతంలో లింగయ్య పై అనిల్ కుటుంబ సభ్యులు దాడి చేశారు.పెద్దమనుషుల సమక్షంలో మంత్రాలు లేవని తీర్మానం చేసి ఇరు కుటుంబ సభ్యులకు సర్దిచెప్పారు. అప్పటి నుండి కక్ష పెంచుకున్న అనిల్ అదునుచూసి పాల్పడ్డాడు సంఘన స్థలాని కొండమల్లపల్లి సీ ఐ శ్రీకాంత్ రెడ్డి , ఎస్సై క్రాంతికుమార్ పరిశీలీంచారు. మృతునికి బార్య,ఇద్దరు కుమారులు,ముగ్గురు కుమార్తెలున్నారు,కుమారుడు రాములు పిర్యాధు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు