క్రైమ్/లీగల్

కాకతీయ కాల్వలో మహిళ గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 30: ఏర్గట్ల శివార్లలో రేణుక అనే వివాహిత యువతి గల్లంతైందని ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. ఎస్‌ఐ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంవత్సరాల క్రితం ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన రేణుకను, బాల్కొండకు చెందిన మారుతికి ఇచ్చి వివాహం చేసినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం తల్లిగారి ఇంటికి వచ్చిన రేణుకను భర్త తీసుకెళ్లేందుకు రాగా, ఇంట్లో చిన్న గొడవ అయినట్లు తెలిపారు. రేణుకను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో బహిర్భూమికి వెళ్తానంటూ వాహనం దిగి కాకతీయ కాల్వలో దూకిందని ఎస్‌ఐ తెలిపారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, గల్లంతైన రేణుక కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటీ ఆచూకీ లభించలేదన్నారు. సంఘటనా స్థలాన్ని భీమ్‌గల్ సీఐ సైదయ్య సందర్శించారు.