క్రైమ్/లీగల్

‘హోదా’ కోసం బలిదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల రూరల్, సెప్టెంబర్ 30 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కర్నూలు జిల్లాలో మరొకరు ప్రాణాలు వదిలారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఆత్మహత్యలకు పాల్పడగా ఈ నెలలోనే కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో ఒక విద్యార్థి ప్రాణాలర్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన జమాల్‌బాషా(25) శనివారం తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని తీవ్ర మనస్థాపానికి గురై తనువు చాలించినట్లు జమాల్‌బాషా సూసైడ్ నోట్‌లో రాసినట్లు గోస్పాడు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. జమాల్‌బాషా డిగ్రీ వరకూ చదివాడని, వివాహం కూడా అయిందని, నా మృతికి భార్యకు ఎటువంటి సంబంధం లేదని, డిగ్రీ చదివినా కూడా ఉద్యోగం లేక స్వయంగా సెల్ పాయింట్ నడుపుతున్నానని, అయినా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నానని ప్రభుత్వం సహాయం చేయాలని సూసైడ్‌నోట్‌లో రాసినట్లు తెలిపారు. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కూడా రాసి చనిపోతున్నానని లేఖలో పేర్కొన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన జమాల్‌బాషా (పాతచిత్రం)