క్రైమ్/లీగల్

దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లజర్ల, అక్టోబర్ 1: అనారోగ్యం పాలైన భర్త తనకు కొద్ది రోజుల్లో దూరమవుతాడని తెలిసి, తట్టుకోలేని భార్య అతనితో కలిసి పురుగుల మందు సేవించి, బావిలో దూకి ప్రాణాలు విడిచింది. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతునీడిపాలెంలో సోమవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన జ్యోతికి నల్లజర్లమండలం పోతునీడిపాలెం గ్రామానికి చెందిన సోమా విష్ణుమూర్తికి 2009వ సంవత్సరంలో వివాహమైంది. వీరిద్దరు జంగారెడ్డిగూడెంలో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. విష్ణుమూర్తి జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల బాబు ఉన్నాడు. విష్ణుమూర్తి (32)కి కొద్ది కాలంగా అనారోగ్యంగా ఉండటంతో పరీక్షలు చేయించుకుంటే గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్టు వెల్లడయ్యింది. ఈ వ్యాధి నయం కాదని విష్ణుమూర్తి ఎంతో కాలం బతకడని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబంలో కల్లోలం రేగింది. అనారోగ్యంతో భర్త మరణిస్తే తాను బతకలేనని భావించిన జ్యోతి భర్తతోపాటు చనిపోవాలని నిర్ణయించుకుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సోమవారం నల్లజర్ల మండలంలోని తమ స్వగ్రామమైన పోతునీడిపాలెంలోని తమ ఇంటికి ద్విచక్ర వాహనంపై వచ్చారు.
అక్కడ నుంచి గ్రామ శివార్లలోని తమ సొంత పొలంలో వ్యవసాయ బావి వద్ద కూర్చొని కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి, అనంతరం బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో బావి వద్దకు చేరుకున్నారు. నల్లజర్ల పోలీసులు రంగంలోకి దిగి, మృతదేహాలను వెలికితీయించారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ పి శ్రీను సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు (ఫైల్ ఫొటో)