క్రైమ్/లీగల్

గంటల వ్యవధిలో తండ్రికొడుకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామన్నపేట, అక్టోబర్ 5: అన్యారోగ్యంతో తండ్రి మరణించిన కొద్దిగంటలలోనే కుమారుడు మృతి చెందిన ఘటన మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. లక్ష్మాపురం గ్రామానికి చెందిన బత్తుల అయ్యన్న అనారోగ్యానికి గురై శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి మరణంతో విషాదంలో మునిగిన బత్తుల ఆంజనేయులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం నల్లగొండకు తరలించేలోపు గుండెపోటుతో మృతి చెందారు. ఇలా ఒకే కుటుంబంలో ఒకేరోజు తండ్రికొడుకులు మృతిచెందడంతో గ్రామంలో విషాధచాయలు నెలకొన్నాయి. ఆంజనేయులు, ఆయన తండ్రి మృతదేహాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆంజనేయులు మృతిపట్ల టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గంగుల రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బత్తుల క్రిష్ణగౌడ్, నాయకులు జినుకల ప్రభాకర్, బందెల రాములు, రామిని రమేష్, ఆకవరపు మధుబాబు, జెల్ల వెంకటేశం, బొక్క మాధవరెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తంచేసి నివాళులు అర్పించారు.