క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార, అక్టోబర్ 8: మండలం వత్సవలస పంచాయితీ మొగదాలపాడు గ్రామంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలియజేసిన వివరాలు మేరకు గ్రామానికి చెందిన మైలపల్లి సత్యరాజులు (23) ఉపాదికై విరావళి ప్రాంతానికి వెళ్లి వారం రోజులు క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం నడకదారిలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రక్కగా వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైరు తెగిపడి ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో మృతుడు పెద్దగా కేకలు వేయడంతో ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు చేసిన ప్రయత్నం సత్యరాజులు ప్రాణాలను కాపాడలేకపోయింది. అప్పటికై 90శాతం కాలిన గాయాలు కావడంతో రిమ్స్‌కి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ మేరకు తల్లి నీలమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు స్థానిక ఎస్సై బలివాడ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.