క్రైమ్/లీగల్

గెడ్డలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుకుంపేట, అక్టోబర్ 8: మండలంలోని తీగలవలస పంచాయతీ కొన్నగరువు గ్రామ సమీపాన గెడ్డలో గుర్తు తెలియని మృతదేహం మంగళవారం లభ్యమయ్యింది. ఈ మార్గంలో కాలినడకన వెళుతున్న గిరిజనులకు గెడ్డ నుంచి దుర్గంధం వెదజల్లడంతో పరిశీలించగా మృతదేహం కనిపించింది. పురుషుని మృతదేహంపై తెల్లచొక్కా, లుంగీ ధరించి ఉందని, గుర్తించలేని విధంగా ఉన్నట్టు చెబుతున్నారు. గెడ్డలో మృతి చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా హత్యకు గురయ్యాడా అనే అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా ఆరుగురికి గాయాలు
హకుంపేట, అక్టోబర్ 8: మండలంలోని పెదగరువు గ్రామ సమీపాన సోమవారం ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ముంచంగిపుట్టు మండలం పెదగూడ గ్రామానికి చెందిన కె.రవికుమార్, కుమార్‌రాజా, పుష్పలతతో పాటు మరికొంత మంది అరకులోయ గురుకుల కశాళాలలో విద్యనభ్యసిస్తూ దసరా సెలవుల నిమిత్తం ఆటోలో వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయిస్తున్నారు. ఈ సంఘటనపై హుకుంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.