క్రైమ్/లీగల్

కరెంట్ షాక్‌తో మున్సిపల్ కార్మికుడికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోత్కూర్, అక్టోబర్ 8: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వివిధ రాజకీయ పార్టీల జెండాలు తొలగిస్తున్న క్రమంలో ఓ మున్సిపల్ కార్మికుడికి కరెంట్ షాక్ తగిలి తీవ్రగాయాలయ్యాయ. ఈ సంఘటన సోమవారం మోత్కూర్ పరిధిలోని ధర్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మాపురం గ్రామానికి చెందిన వర్రె లింగయ్య మోత్కూర్ మున్సిపాలిటీలో పంపు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ధర్మాపురంలో ఓ పార్టీ దిమ్మకు ఉన్న ఇనుప జెండా పైపును తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సను నిర్వహించి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.