క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 8: వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానిక ఆవ రోడ్డులోని ఆదిత్య ఇన్ లాడ్జి వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక రాజు న్యూరో ఆసుపత్రిలో పనిచేసే మేదరపేటకు చెందిన ఎరకా దుర్గాప్రసాద్(26) అనే యువకుడు తన స్నేహితుడు టి రమేష్‌తో కలిసి మోటారుసైకిల్‌పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈసంఘటనలో తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. ఈసంఘటనతో ఆయన పినతల్లి అపస్మారకస్థితికి చేరుకున్నారు. అలాగే సోమవారం సాయంత్రం బొమ్మూరు సెంటర్‌లో 220కెవి సబ్‌స్టేషన్‌లో పనిచేసే కాంట్రాక్టు కార్మికుడు పల్లి శ్రీనివాస్(40)ను లారీ ఢీకొట్టింది. బొమ్మూరు సెంటర్‌లో మలుపుతిరుగుతుండగా వేగంగా వచ్చిన లారీ శ్రీనివాస్‌ను ఢీకొట్టి, డివైడర్‌ను ఢీకొట్టింది. ఈసంఘటనలో శ్రీనివాస్ దుర్మరణం చెందాడు. బొమ్మూరు పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.