క్రైమ్/లీగల్

అనుమానం పెనుభూతమై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, అక్టోబర్ 10: కష్ట సుఖాలను అనుభవిస్తూ సగం జీవితాన్ని గడిపినన భార్యా భర్తల ఇద్దరి మధ్య అనుమానమే పెనుభూతమైంది. భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండలంలోని శివన్నగూడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కధనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూతం యాదయ్య తన భార్య నర్సమ్మ (40)తో కలిసి వాహనాల టైర్లకు పంక్చర్లు చేస్తూ జీవితాన్ని కొనసాగించేవారు. యాదయ్య తాగుడుకు బానిస కావడంతో నర్సమ్మే పంక్చర్లు చేస్తూ కుటుంబ పోషణభారాన్ని భుజాలపై వేసుకుంది. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకొని తరుచూ గొడవలు పడుతుండేవాడు. ఎలాగైనా భార్యను అంతమొందించాలని భావించి నర్సమ్మ నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో మెడపై గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. మృతిరాలికి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకున్న అమ్మాయి, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి ఉన్నారు. ఆ మృతిరాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.