క్రైమ్/లీగల్
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 October 2018
జగ్గయ్యపేట రూరల్, అక్టోబర్ 10: మండలంలోని షేర్మహమ్మద్పేటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన శరణం మనీష (16) జగ్గయ్యపేట వాగ్దేవి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లోని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి విషయం తల్లిదండ్రులకు తెలియపర్చారు. ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు తెలియరాలేదు. మనీష జగ్గయ్యపేటలోని కళాశాలలోనే డిగ్రీ చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని చిల్లకల్లు పోలీసులు తెలిపారు.