క్రైమ్/లీగల్
నలుగురు మావోల అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఏటూరునాగారం, అక్టోబర్ 11: సిపిఐ మావోయిస్టు చర్ల, శబరి ఏరి యా కమిటి ఆధీనంలో పనిచేస్తూ, ద ళాలకు కావాల్సిన సామాగ్రి అందజేసే మిలిషియా ప్లాటూన్ డిప్యూటి క మాండర్తోపాటు మరో ముగ్గురు స భ్యులను అరెస్టుచేసి రిమాండుకు తరలించినట్లు భూపాలపల్లి జిల్లా ఓఎస్డీ కె.సురేష్కుమార్ తెలిపారు. గురువా రం ఉదయం వెంకటాపురం పోలీసు లు, జిల్లా స్పెషల్పార్టీ వెంకటాపురం స్టేషన్ పరిధిలోని యాకన్నగూడెం అటవీ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పందంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సిపిఐ మావోయిస్టులుగా తేలిందన్నారు. వీరందరిని స్దానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అరెస్టు చూపారు. ఓఎస్డీ మాట్లాడుతూ ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన సిపిఐ మావోయిస్టు రైతుకూలీ సంఘం సెక్రటరీ మాడవి సుక్క అలియాస్ చుక్కయ్య, ముచ్చకి జోగా, కొ వ్వాసి హిడ్మా అలియాస్ బోటి, మడవి మంగు అలియాస్ లక్కే అలియాస్ మంగడులు చర్ల, శబరి ఏరియా కమి టి ఆధ్వర్యంలో పనిచేస్తూ 2018 ఫిబ్రవరిలో ఎదిరలో బిఎస్ఎన్ఎల్ టవర్ ను పేల్చిన ఘటన, 2018 జనవరిలో భూపతిరావుపేట ఇసుక క్వారీల ర్యా ంపులో లారీలను దహనంచేసి, జోగయ్యను హత్యచేసిన ఘటన, 2017 డి సెంబర్లో కొత్తపల్లి క్రాస్రోడ్డు వద్ద వాల్పోస్టర్ల కింద మందుపాతర పేలి చన ఘటన, 2016 జూన్లో ల్యాండ్మైన్తో రమేష్ అనేవ్యక్తి, ఆటోడ్రైవర్ గాయపడిన ఘటన, 2015 మేలో తి ప్పాపురంకు చెందిన కుర్సం బాలకృష్ణను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో కా ల్చి చంపిన ఘటన, 2015 ఆగష్టు చర్ల మండలం పూసుగుప్ప-వద్దిపేట గ్రా మాల రోడ్డుపై కందకాలు త్రవ్విన ఘ టన, 2014లో అంకన్నగూడెం-యాకన్నగూడెం గ్రామ సమీపంలో చెట్లను నరికి రోడ్డుకు అడ్డంగా వేసిన ఘటన, 2013 ఫిబ్రవరిలో చర్ల మండలం వద్దిపేట శివారులో డీసిల్తో జెసిబి య ంత్రాన్ని తగులపెట్టిన ఘటనలో, 20 12 నవంబర్ కొండాపురం సమీప ంలో చెట్లను నరికి, భ్యానర్లు కట్టిన ఘటనలలో వీరంతా నిందితులన్నారు. వీరిలో మడవి సుక్కపై 11 కేసులు, ముచ్చకీ జోగాపై 10 కేసులు, కొవ్వాసి హిడ్మాపై 6 కేసులు, మడవి మంగుపై 3 కేసులు నమోదైనట్లు తెలిపారు. నక్సల్స్ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను వదలి జనజీవన స్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా ఓఎస్డీ కోరారు. కార్యక్రమంలో ఏటూరునాగారం డిఎస్పీ రమణారెడ్డి, సిఆర్పిఎఫ్ కమాండర్ జాలమ్సింగ్, వెంకటాపురం సిఐ రవీందర్, ఎస్సై బండారి కుమార్, వాజేడు ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.