క్రైమ్/లీగల్

ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, అక్టోబర్ 12: అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఉప్పులూరి కిశోర్‌కుమార్ (25) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. ఇందుకు సంబంధించి అల్లవరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తోగమ్మి గ్రామానికి చెందిన కిశోర్‌కుమార్ ఫైనల్ బీటెక్ చదువుతున్నాడు. ఆతను నాలుగేళ్ళల్లో 20 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో కాలేజీ ప్రిన్సిపాల్ అతని తండ్రికి సమాచారం అందించారు. తండ్రి సత్యనారాయణ శుక్రవారం ఉదయం కళాశాలకు వచ్చి కిశోర్‌కుమార్ ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. అనంతరం సత్యనారాయణ కిశోర్‌కుమార్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఫోన్ ఎత్తకపోవడంతో కుమారుడు ఉండే రూమ్‌కి వెళ్ళగా తలుపులు గడియపెట్టి ఉన్నాయి. కళాశాల సిబ్బంది గది తలుపులు బద్దలు కొట్టగా కిశోర్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. తండ్రి కళాశాలకు వచ్చి వివరాలు తెలుసుకున్నాడని మనస్తాపంతో ప్లాస్టిక్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.