క్రైమ్/లీగల్
రాజిరెడ్డిపల్లి కుంటలో పడి ఒకరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 14 October 2018
గజ్వేల్, అక్టోబర్ 13: గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని రాజిరెడ్డిపల్లి కుంటలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి గజ్వేల్ సీఐ ప్రసాద్ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన శశాంక్(11) తన స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు రాజిరెడ్డిపల్లి కుంటలో దిగాడు. అయితే అతనికి ఈత రాకపోవడం, జేసీబీ గుంతలు ఉండడంతో నీటిలోకి జారి పోగా, గజ ఈతగాల్లను రప్పించి శశాంక్ మృతదేహాన్ని వెలికి తీసారు. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ పోలీసులు పేర్కొన్నారు.