క్రైమ్/లీగల్

లంక భూముల్లో హిజ్రా అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, అక్టోబర్ 15: తిరుపతమ్మ అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ఒక హిజ్రా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనుగుంట్ల గ్రామానికి చెందిన పాలకూటి రామయ్య ఎలియాస్ రమ్య తన 8మంది స్నేహితులతో కలిసి ఆదివారం సాయంత్రం తిరుపతమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. రాత్రి 9గంటల సమయంలో పాలు పొంగళ్లు నిర్వహించి అమ్మవారికి సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మునే్నటి మధ్యలో ఉన్న లంక తోటల్లో గేదెల కాపరికి మృతదేహం కనబడటంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ఐ అవినాష్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రమ్య మొహంపై గాయాలు ఉండటాన్ని గమనించారు. దీనిపై తిరుపతమ్మ అమ్మవారి ఆలయం వద్ద సీసీ టీవీ పుటేజీ పరిశీలించి వారితో పాటు వచ్చిన వారి వివరాలు కూడా సేకరించారు. వీఆర్‌ఒ ఇచ్చిన ఫిర్యాదుపై నందిగామ ఇన్స్‌పెక్టర్ పీవీ రమణ ఆధ్వర్యంలో హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.