క్రైమ్/లీగల్

ప్రేమికుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, అక్టోబర్ 16: కడ్తాల మండల పరిధిలోని చరికొండ గ్రామ పంచాయతీలో బోయిన గుట్ట తాండాకు చెందిన ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఎస్‌ఐ సుందరయ్య తెలిపారు. ఈ సంఘటనతో తండాలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బోయిన గుట్ట తాండాకు చెందిన నేనావత్ రేణుక , పాత్లావత్ రాజు ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయారు. అమ్మాయి తల్లి దండ్రులు కడ్తాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజు పై కిడ్నాప్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అమ్మాయికి కౌనె్సలింగ్ నిర్వహించి తల్లి దండ్రులకు అప్పగించారు. జైలు నుంచి విడుదలైన రాజు అమ్మాయితో మాట్లాడ సాగాడు. దీంతో అమ్మాయిని తల్లి దండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురైన రేణుక ఈ నెల 12వ తేదిన పురుగుల మందు తాగి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. విషయం తెలుసుకున్న రాజు పొలం వద్ద సోమవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. దీంతో తాండాలో ఉద్రిక్త పరిస్తితి నెలకొనడంతో ముందు జాగ్రత్తగా షాదనగర్ ఏసీపీ సురేందర్ ఆదేశానుసారం సీఐ నర్సింహ్మరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు సురేశ్ యాదవ్, సుందరయ్య, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.