క్రైమ్/లీగల్

చెన్నసముద్రంలో ఇద్దరి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, అక్టోబర్ 21: చిత్తూరు రూరల్ మండలం చెన్నసముద్రంలో శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు కథనం మేరకు చిత్తూరు రూరల్ మండలం చెన్నసముద్రానికి చెందిన కేశవులు (54) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమార్తెకు సుమారు 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. కాగా అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్న శేఖర్ (40) తరచూ కేశవుల కుమార్తెను లైంగికంగా వేధించడంతోపాటు, కులం పేరుతో దూషించేవాడు. దీనిని జీర్ణించుకోలేని కేశవులు శేఖర్‌ను హతమార్చాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన లక్ష్మీపతి (55) తన మిత్రుడైన శేఖర్‌ను మద్యం సేవించడానికి రావాలని పిలిచాడు. దీంతో మద్యం సేవించడానికి గ్లాస్ కోసం లక్ష్మీపతి ఇంటికి వచ్చి తిరిగి వెళుతుండగా అక్కడే ఉన్న కేశవులును పిలిచాడు. దీంతో ముగ్గురు మద్యం సేవించడానికి గ్రామ సమీపంలోని పొలాల వద్దకు వెళ్లారు. శేఖర్‌ను హత్య చేయడానికి ఇదే అదునుగా భావించి కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే ఉన్న చెరకుతోటలో పడేశాడు. ఇక లక్ష్మీపతి బతికి ఉంటే ఈ హత్యకు సాక్ష్యంగా ఉంటాడని భావించిన కేశవులు మద్యం మత్తులో పడిపోయిన లక్ష్మీపతిని కూడా కత్తితో గొంతు కోసి హతమార్చి పారిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో కేశవులు జాడ లేకపోవడంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేశవులు స్థానిక రెవిన్యూ అధికారుల వద్ద లొంగిపోవడంతో వారి సమాచారంతో నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ తెలిపారు.