క్రైమ్/లీగల్

మంచానికి ఉరి వేసుకుని వృద్ధురాలి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 22: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలు మంచానికే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. భర్త పక్కనే నిద్రిస్తుండగా తోటి రోగులు, వారి బంధువులు వార్డులో నిద్రిస్తున్న సమయంలో చిన్న నారాయణమ్మ (65) తాను చికిత్స పొందుతున్న మంచానికి చీర కొంగు కట్టి గొంతుకు బిగించుకుని బలన్మరణానికి పాల్పడింది. లేపాక్షి మండలం బింగిపల్లికి చెందిన నారాయణమ్మకు పక్షవాతం సోకడంతో ఆరు రోజుల క్రితం హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. శనివారం రక్తం కూడా ఎక్కించారు. కొద్దిరోజుల పాటు మెరుగైన చికిత్స అవసరమని డాక్టర్లు సూచించారు. అయితే ఆ వృద్ధురాలు ఎంతగా మనోవేదన చెందిందో ఏమో ఆసుపత్రి వార్డులోని మంచానికి చీర కొంగు కట్టి మరోవైపు మెడకు చుట్టుకుని ప్రాణాలు తీసుకుంది. వేకువజామున
అందరూ నిద్రిస్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడింది. విధి నిర్వహణలో భాగంగా సెక్యూరిటీ గార్డు వార్డును పరిశీలించగా నారాయణమ్మ మంచం కింద అపస్మారక స్థితిలో ఉండటం, గొంతుకు చీర కొంగు వేలాడుతుండటం గమనించి వెంటనే ఆసుపత్రి అధికారులకు తెలియచేశాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అమెను అత్యవసర చికిత్స విభాగానికి తరలించారు. అయితే అప్పటికే నారాయణమ్మ మృతి చెందింది. కాగా నారాయణమ్మ బలవన్మరణంపై ఆమె భర్త, కుటుంబసభ్యులు స్పందిస్తూ ఇక నడవలేనన్న ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..నారాయణమ్మ మృతదేహం