క్రైమ్/లీగల్

ప్రైవేట్ బస్సు ఢీకొని మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 29: స్థానిక అన్నారావు సర్కిల్ సమీపంలో భవానీ నగర్ నుంచి రుయా హాస్పిటల్ వైపు వెళుతున్న ప్రైవేట్ బస్సు ఢీకొని గుర్తు తెలియని దాదాపు 35 సంవత్సరాలు వయస్సున్న మహిళ మృతి చెందింది. రోడ్డు దాటుతున్న ఆమెను బస్సు ఢీకొన్న సంఘటనలో ఆమె తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను రుయా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈమె అన్నారావు సర్కిల్ పరిసర ప్రాంతాల్లో నివసించే మహిళ అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. తిరుపతి ట్రాఫిక్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.