క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, నవంబర్ 1: నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గద్దెల సాయిలు(57), చాకలి రామారావు(48)లు అక్కడికక్కడే మృతి చెందారు. ఆంధ్రనగర్‌కు చెందిన వీరిరువురు కలిసి టీవీఎస్ ఎక్సెల్‌పై గ్రామ శివారులో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతుండగా, రామాలయం సమీపంలో వెనుక నుండి వస్తున్న నిజామాబాద్ ఆర్టీసీ డిపో బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో రామారావు, సాయిలు అక్కడికక్కడే మృతి చెందారు. సాయిలు మృతదేహం అయితే వెనుక చక్రాల్లో ఇరుక్కుపోయి నడుము కిందిభాగం అంతా నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. ఎస్‌ఐ రాఘవేందర్ తన సిబ్బందితో చేరుకుని శవ పంచనామా జరిపేందుకు సిద్ధమవగా, మృతుల కుటుంబీకులు అడ్డుకుని శవాలతో ధర్నా, రాస్తారోకోకు దిగారు. బాధిత కుటుంబాలకు 10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో రాత్రి వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది.