క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, మార్చి 4: ఆగి ఉన్న ఆటోను టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం పెరికెగూడెం ఐస్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండల పరిధిలోని గోపవరానికి చెందిన ధారం సునీల్ సామ్రాజ్య (44) ట్రక్ ఆటోలో బియ్యం బస్తాలను కైకలూరు నుండి గుడివాడకు తీసుకువెళుతున్నాడు. ట్రక్‌లో ఉన్న బియ్యం బస్తాలు కదిలినట్లు గుర్తించిన డ్రైవర్ పెరికెగూడెం ఐస్‌ఫ్యాక్టరీ వద్ద ఆటోను నిలుపుదల చేసి బియ్యం బస్తాలను సరి చేస్తున్నారు. అదే సమయంలో కైకలూరు నుండి వేగంగా వచ్చిన టిప్పర్ సునీల్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సునీల్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఎస్‌ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.