క్రైమ్/లీగల్

బొల్లారంలో అదృశ్యం.. ముంబయిలో ప్రత్యక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్ : కంటోనె్మంట్ బొల్లారంలో తప్పిపోయిన కేంద్రీయ విద్యాలయం పాఠశాల విద్యార్థులు ముగ్గురు ముంబయికి చెరుకున్నట్లు శుక్రవారం ఉదయం సమాచారం వచ్చింది.
అనుమానాస్పదంగా రైలు దిగి అటుఇటు తిరుగుతున్న విద్యార్థులను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొల్లారం నుంచి పారిపోయి వచ్చిన విషయం తెలుసుకొని తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇచ్చారు. వెళ్లారు. బేగంపేట సీఐ రాంప్రసాద్ బృందం, విద్యార్థుల తల్లితండ్రులు తరలివెళ్లారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలియటంతో తల్లదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కేసును విచారిస్తున్న బొల్లారం సీఐ శే్వత శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. బోయిన్‌పల్లిలోని ఆమె నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపడటంతో సికింద్రబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.