క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో నగరవాసి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/ జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 3: విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారిపై జిల్లా సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు సమీపంలోని కృష్ణా ఇన్ హోటల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. చిల్లకల్లు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళుతున్న కారు అనుమంచిపల్లి రెస్టారెంట్ వద్ద ముందు వెళుతున్న ఓల్వో బస్సును ఓవర్‌టేక్ చేస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన మాజేటి జగదీష్(50) సీటు, స్టీరింగ్ మధ్య నలిగిపోయి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు విజయవాడ ఓడా ఫోన్ డిస్ట్రిబ్యూటర్‌గా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న సీతారామయ్య, సత్యనారాయణ, శివకుమార్‌లు తీవ్రంగా గాయపడగా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను విజయవాడకు తరలించడంలో ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదానికి
కారకులైన ఇద్దరి అరెస్టు
కంకిపాడు, నవంబర్ 3: రోడ్డు ప్రమాదాలకు కారకులైన ఇద్దరు వాహన చోదకులను కంకిపాడు పోలీసులు శనివారం అరెస్టు చేశారు.