క్రైమ్/లీగల్

ఇద్దరు మిలీషియా సభ్యుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 3: మావోయిస్టు మిలీషియా సభ్యులను చర్ల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చర్ల ఎస్సై రాజువర్మ ఆధ్వర్యంలో సివిల్ పోలీసులు, 141 సీఆర్‌పీఎఫ్ జవాన్లు కుర్నపల్లి రోడ్డులో దానవాయిపేట శివారులో శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో వారు చర్ల మండల పరిధిలోని కుర్నపల్లి పంచాయతీ రామచంద్రాపురం గ్రామానికి చెందిన ముష్కి గంగయ్య, భట్టిగూడెం గ్రామానికి చెందిన మడకం జోగయ్యలు తేలిందని, వీరు కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో మిలీషియా సభ్యులుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. చర్ల మండల పరిధిలోని పెద్దమిడిసిలేరు గ్రామంలో సోడె ప్రసాద్ అనే వ్యక్తిని హతమార్చిన ఘటన, ఇర్పా లక్ష్మణ్ హత్య, తిప్పాపురం చుట్టుపక్కల మందుపాతరలు అమర్చిన ఘటన, సత్యనారాయణపురం వద్ద కల్వర్టును పేల్చిన ఘటన, చర్ల బస్టాండ్‌లో బాంబు వదిలిన ఘటన, కుర్నపల్లిలో ఇర్పా వెంకటేశ్వర్లును హతమార్చిన ఘటనలో వీరు నిందితులను, వీరిపై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు పేర్కొన్నారు.