క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 4 November 2018
ఇచ్ఛాపురం(రూరల్), నవంబర్ 4: మండలంలో లొద్దపుట్టి వద్ద జాతీయరహదారి వద్ద రోడ్డుప్రమాదంలో 5 సంవత్సరాలు వయస్సుగల పైల హేమంత్ మృతి చెందాడు. లొద్దపుట్టికి చెందిన యోగేష్, తల్లి నిర్మల కలిసి హేమంత్ తులసమ్మ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరిగి జాతీయరహదారి డివైడర్ గుండా వస్తూ రోడ్డు దిగి గ్రామానికి వెళ్తుండగా కంచిలి వైపు నుండి బరంపురంకు వెళ్తున్న లారీ ఢీ కొంది. మృతదేహాన్ని ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై రూరల్ ఎస్ ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసారు.